చెన్నై: యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(యూఎఫ్బీయూ) ఈ నెల 22న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ)తో ముంబైలో జరిగిన చర్చలు విఫలం కావడంతో యూఎఫ్బీయూ సమ్మె చేపట్టాలని నిర్ణయించింది. బ్యాంకింగ్ రంగంలోని తొమ్మిది బ్యాంకులు యూఎఫ్బీయూ గ్రూపులోనే ఉన్నాయి. బ్యాంకింగ్ రంగంలో చేపట్టిన సంస్కరణలు, ఇతర అంశాలకు వ్యతిరేకంగా యునైటెడ్ ఫోరమ్ నిరసన చేపట్టింది. చర్చల్లో తమ డిమాండ్లకు సానుకూల స్పందన రాకపోవడం వల్లే తాము సమ్మెకు దిగుతున్నట్లు యునైటెడ్ ఫోరమ్ కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం తెలిపారు.