ముంబై: దేశ ఆర్థిక రాజధానిలో ఓ 18 ఏండ్ల కుర్రాడి దారుణ హత్య ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నది. గత అర్ధ రాత్రి కుర్రాడిని అతి దారుణంగా గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. భాండుప్ లో ఈ దారుణ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఓ వ్యక్తి పై అనుమానం ఉన్న పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.