ఆంద్రప్రదేశ్ రాజధాని అమరావతి లో తొలి ప్రైవేట్ విద్యా సంస్ధ ప్రారంభం కాబోతుంది. తమిళనాడు కు చెందిన యస్. అర్.ఎమ్. యూనివర్సిటీ ని రేపు ఆంద్రప్రదేశ్ ముఖ్య మంత్రి , వెంకయ్య నాయుడు కలిసి ప్రారంభించనున్నారు.. ఆగష్టు నెల నుండి తరగతులు మొదలు పెట్టనున్న ఈ యూనివర్సిటీ లో వచ్చే 5 ఏళ్ళలో 10 వేల మంది విద్యార్థుల ను తీసుకొచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. మంగళగిరి మండలం నీరుకొండ ,కురగల్లు గ్రామాల మధ్య 200 ఎకరాల్లో ఎస్.అర్.ఎమ్. యూనివర్సిటీ నిర్మాణం జరుగుతుంది..