నంద్యాల: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల హామీలు నెరవేర్చడంలో ఘోరంగా విఫలమయ్యారని ప్రతిపక్ష నేత జగన్ ధ్వజమెత్తారు. నంద్యాల ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ఆయన వీపీ నగర్, చింత అరుగు, మాల్దార్పేటలో రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల మేనిఫెస్టోలో రైతు రుణమాఫీ, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు మాట తప్పారని విమర్శించారు. జాబు కావాలంటే బాబు రావాలని చెప్పిన చంద్రబాబు నిరుద్యోగులకు ఒక్క జాబైనా ఇచ్చారా? అని ప్రశ్నించారు. ఈ నెల 2న వైకాపా తీర్ధం పుచ్చుకుని ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి శిల్పా చక్రపాణిరెడ్డి ఈరోజు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎమ్మెల్పీ పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆయన ఎక్కడా కనిపించకపోవడంతో రకరకాల వార్తలు వచ్చాయి. దీంతో ఈరోజు ఆయన ప్రచారంలో పాల్గొని తాను ఎక్కడికీ వెళ్లిపోలేదని.. వైకాపాలోనే ఉన్నానని స్పష్టం చేశారు.