జంషెడ్ పూర్ చెందిన గుహా అనే రిటైర్డ్ ఉద్యోగికి ఏకంగా 38 వేల కోట్లకు పైగా బిల్లు విద్యుత్ శాఖ అధికారులు వేశారు. అంతేకాదు, బిల్లు చెల్లించనందుకు కరెంట్ కట్ చేశారు. మూడు రూములున్న తన ఇంట్లో మూడు ఫ్యాన్లు, మూడు లైట్లు, ఒక టీవీ మాత్రమే ఉందని, వీటికి 38వేల కోట్ల బిల్లు ఎలా వేస్తారని బాధితుడు ఆవేదన చెందుతున్నాడు. బిల్లును చూసిన గుహా భార్యకు షుగర్ లెవల్స్ పెరిగి ఆస్పత్రి పాలయ్యింది. పెద్ద పెద్ద పరిశ్రమలు 24 గంటల పాటు పని చేసినా నెల రోజుల్లో ఇంత కరెంట్ బిల్లు రాదని, ఓ మధ్యతరగతి కుటుంబానికి ఇంత బిల్లు రావడమేంటని స్థానికులు అంటున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై ఫిర్యాదు చేశారు.