గోరఖ్ పూర్ లో చిన్నారుల మృతిని సుమోటోగా స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. చిన్నారుల మృతిని సుమోటోగా స్వీకరించి.. సిట్ విచారణ జరిపించాలని పిటిషనర్ కోర్టుకు విన్నవించారు. పిటిషనర్ వినతిని తోసిపుచ్చిన కోర్టు.. లక్నో హైకోర్టులో అప్పీల్ చేయాలని పిటిషనర్ కు సూచించింది. చిన్నారుల మృతి ఘటనను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారని పిటిషనర్ కు కోర్టు తెలిపింది. గోరఖ్ పూర్ బీఆర్డీ ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 63 మంది చిన్నారులు మృతి చెందిన విషయం విదితమే.