ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొండచరియలు విరిగిపడి ఐదుగురు మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 13, 2017, 10:40 AM

హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ర్టాల్లో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఉత్తరాఖండ్‌లో ముగ్గురు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. హిమాచల్‌ప్రదేశ్‌లో కొండచరియలు విరిగిపడటంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. నలుగురు గాయపడ్డారు. మనాలి - పఠాన్‌కోట్ జాతీయ రహదారిపై కొండచరియలు విరిగి పడుతుండటంతో.. ఆ రహదారిని పోలీసులు మూసివేశారు. ప్రయాణికులు రోడ్లపైనే చిక్కుకున్నారు. కొండచరియలను తొలగించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com