హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ర్టాల్లో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఉత్తరాఖండ్లో ముగ్గురు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. హిమాచల్ప్రదేశ్లో కొండచరియలు విరిగిపడటంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. నలుగురు గాయపడ్డారు. మనాలి - పఠాన్కోట్ జాతీయ రహదారిపై కొండచరియలు విరిగి పడుతుండటంతో.. ఆ రహదారిని పోలీసులు మూసివేశారు. ప్రయాణికులు రోడ్లపైనే చిక్కుకున్నారు. కొండచరియలను తొలగించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.