న్యూఢిల్లీ: బీజేపీతో పొత్తుపై ప్రధాని మోదీ నూరు శాతం హామీ ఇచ్చారని జమ్మూకశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ తెలిపారు. ఇవాళ ఆమె ఢిల్లీలో ప్రధాని మోదీని కలిశారు. ప్రస్తుతం కశ్మీర్లో బీజేపీ-పీడీపీ మధ్య పొత్తు ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆర్టికల్ 35ఏపై చర్చ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో రెండు పార్టీల మధ్య విబేధాలు వస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. 35ఏ ఆర్టికల్పై చర్చ చేపడితే దాని వల్ల జమ్మూకశ్మీర్పై నెగటివ్ ప్రభావం పడే అవకాశాలున్నాయని ఆమె తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక హోదాకు ఏదైనా విఘాతం జరిగితే అక్కడ జాతీయ జెండాను పట్టుకునేందుకు ఎవరూ ఉండరని కూడా ఇటీవల ముఫ్తీ హెచ్చరించిన విషయం కూడా తెలిసిందే. జమ్మూకశ్మీర్ను ఇండియాలో భాగస్వామ్యం చేయడమే తమ ఉద్దేశమని ఆమె అన్నారు. 35 ఏ అంశాన్ని చర్చించేందుకు ఇటీవల కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ను కూడా ముఫ్తీ కలిశారు.