కర్ణాటకలోని రాయచూరులో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన భార్యతో పాటు ఆమె తల్లి, చెల్లెలిని దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి యరమరాస్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. యరమరాస్ ఇంజినీరింగ్ కాలేజీ వద్ద నివాసం ఉంటున్న పారిశుధ్య కార్మికురాలు సంతోష్ (45)కి వైష్ణవి(25), ఆరతి(16) అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. 6 నెలల క్రితం హైదరాబాద్ కు చెందిన సాయి అనే యువకుడితో వైష్ణవికి వివాహం జరిపించారు. పెళ్లైనప్పటి నుంచి సాయి తన భార్యను చిత్రహింసలకు గురి చేసేవాడు. దీంతో ఇటీవల వైష్ణవి పుట్టింటికి వచ్చింది. మంగళవారం రాత్రి సాయి కూడా అత్తవారింటికి వచ్చాడు. తనతో హైదరాబాద్ కు రావాలని తన భార్య వైష్ణవిని ఒత్తిడి చేశాడు.