కర్నూలు: నంద్యాల ఉపఎన్నికలో టీడీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరని మంత్రి కాల్వ శ్రీనివాసులు చెప్పుకొచ్చారు. కొద్దిసేపటి క్రితం ఆయన ఏబీఎన్తో మాట్లాడుతూ.. టీడీపీ గెలుపు ఖాయం.. ఈ విజయాన్ని ఎవరూ ఆపలేరని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ వ్యాఖ్యలపై కేంద్ర భద్రతా విభాగం ఆరా తీసి తగిన చర్యలు తీసుకోవాలని కాల్వ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. జగన్కు మానసిక వైద్యుల అవసరం ఉందని మంత్రి కాల్వ చెప్పుకొచ్చారు.