న్యూఢిల్లీ: నేటితో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగియనున్నాయి. 19రోజుల సమావేశాల్లో కేవలం 13బిల్లులకు మాత్రమే ఆమోదం లభించింది. ఒకవైపు సమావేశాలు ముగిసిన తర్వాత ప్రతిపక్ష పార్టీలు సమావేశం కానున్నాయి. ఈసారి సమావేశాల్లో గోరక్షక్ పేరుతో దాడులు, గుజరాత్ రాజ్యసభ అంశాలు కుదిపేశాయి. ఈ విషయాల్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రతిపక్షాలు భావించాయి. అయితే ప్రతిపక్షాల ఐక్యతను దెబ్బతీసే విధంగా బీహార్లో నితీష్ కుమార్ యూ టర్న్ తీసుకున్నారు. మహాకూటమిని బద్దలు కొట్టి ఎన్డీఏలో చేరిపోయారు. దీంతో కాంగ్రెస్ పార్టీ కొంతమేర ఇబ్బందుల్లో పడింది. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల మధ్య అనైక్యత కొట్టొచ్చినట్టు కనిపించింది. ఈ సమావేశాల్లో 25బిల్లులను ప్రభుత్వం అజెండాలో చేర్చింది. ఇందులో కేవలం 13బిల్లులకు మాత్రమే ఆమోదం లభించింది.