చీరాల ప్రకాశం జిల్లా చీరాల పట్టణంలోని సురేశ్ మహల్ సినిమా హాలు అగ్నిప్రమాదంలో దగ్ధమైంది. దివంగత దగ్గుబాటి రామానాయుడు కుటుంబానికి చెందిన ఈ సినిమా హాల్ను మరమ్మతులు చేసి రెండు థియేటర్లుగా అత్యాధునిక టెక్నాలజీతో తీర్చిదిద్దారు. ఒక థియేటర్ పూర్తి కావడంతో రేపు రామానాయుడు మనవడు, సినీ హీరో రానా చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేశారు. అయితే ఈరోజు ఏసీలు బిగించే సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అందరూ చూస్తుండగానే హాల్ మొత్తానికి మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక శకటాలు అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ ప్రమాదంలో రూ.లక్షల మేర ఆస్తినష్టం సంభవించినట్లు సమాచారం.