ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కోర్టు ఆవరణలో కాల్పులు.. నలుగురు మృతి

national |  Suryaa Desk  | Published : Fri, Sep 24, 2021, 04:08 PM

ఢిల్లీలోని రోహిణి కోర్టు ఆవ‌ర‌ణ‌లో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌ స్ట‌ర్ జితేంద్ర అలియాస్ గోగిపై దుండ‌గులు కాల్పులు జ‌రిపారు. ఓ కేసు విచార‌ణ నిమిత్తం జితేంద్ర‌ శుక్ర‌వారం రోహిణి కోర్టుకు వచ్చారు. అతడిని న్యాయ‌మూర్తి ఎదుట హాజ‌రుప‌రుస్తుండ‌గా ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. కాల్పుల్లో జితేంద్ర స‌హా న‌లుగురు మ‌ర‌ణించారు. న్యాయ‌వాదుల మాదిరిగా కోర్టు ఆవ‌ర‌ణ‌లోకి వ‌చ్చిన దుండగులు దాడికి తెగ‌బ‌డ్డారు. దాడిలో పాల్గొన్న ఇద్ద‌రిని ఢిల్లీ పోలీస్ స్పెష‌ల్ సెల్ హ‌త‌మార్చింది. ప్ర‌త్య‌ర్ధి గ్యాంగ్‌ కు చెందిన వారే గ్యాంగ్‌ స్ట‌ర్ జితేంద్ర‌పై కాల్పులు జ‌రిపిన‌ట్టు భావిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌లో జితేంద్ర త‌ర‌పు న్యాయ‌వాదికి గాయాల‌య్యాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com