ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫ్లై వోవర్ నుంచి పడి ఇద్దరు యువకుల దుర్మరణం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 24, 2021, 01:02 PM

విశాఖపట్టణం: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్నేహితులు మృత్యువాత పడ్డారు. ఇద్దరిలో ఒకరు ఏస్ మెకానిక్ కాగా, మరొకరు జీవీఎంసి సంహౌస్ ఎలక్ట్రిసియన్ పనిమీద నగరం రాజశేఖర్ లోకి వస్తుండగా రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. కాన్వెంట్ జంక్షన్ వంతెనపై గురువారం జరిగిన ఈ ఘటనకు సంబందించి హార్బర్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.


అగనంపూడి పెదవుడక ప్రాంతానికి చెందిన దార్ల రాజశేఖర్ (16), మోటూరి గోవింద ప్రాణ స్నేహితులు ఉదయం 11 గంటల సమయంలో పీలానగర్ నుంది. కాన్వెంట్ జంక్షన్ వైపు స్కూటర్ పై బయలుదేరారు. వైకవర్ వంతెనపై ముందు వెళుతున్న లారీని తప్పించబోయి అదుపుతప్పారు. రోడ్డుపై వున్న మరదలో వాహనం స్కీడ్ అవ్వడంతో జారిపడిపోయారు.


తలకు తీవ్ర గాయాలు కావడంతో ఇద్దరూ అక్కడికప్పుడే చనిపోయారు. గోవింద కు భార్య రాజేశ్వరి, ఇద్దరు కుమారులు ఉన్నారు. జీవీఎంసీ వాటర్ సరపరా విభాగంలో సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. చంద్రశేఖర్‌కు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఏసీ మెకానిక్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కుటుంబ పెద్దల్ని కోల్పోవడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com