న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి హమిద్ అన్సారీకి ఇవాళ రాజ్యసభలో ఘనంగా వీడ్కోలు పలికారు. రాజ్యసభ చైర్మెన్గా ఉన్న ఆయనకు ఇవాళే చివరి రోజు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు ఆయనకు ఫేర్వెల్ పలికారు. రాజ్యసభకు ఆయన పదేళ్లు చైర్మెన్గా ఉన్నారు. హమీద్ అన్సారీ గొప్ప దౌత్యవేత్త అని ప్రధాని మోదీ ఆయన్ను కీర్తించారు. రాజ్యసభలో మాట్లాడిన ప్రధాని మోదీ.. అన్సారీ అంకితభావగం కలిగిన నేత అన్నారు. రాజ్యసభ చైర్మెన్గా సేవలు అందించిన అన్సారీకి ప్రధాని థ్యాంక్స్ చెప్పారు. పార్లమెంట్ ఉభయసభల తరపున ఆయన ధన్యవాదాలు తెలిపారు. మీ ప్రతిభతో దేశాన్ని సరైన మార్గంలో నడిపించారన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా అన్సారీకి ఫేర్వెల్ మెసేజ్ వినిపించారు. మిమ్మల్ని మిస్ అవుతున్నామని, మంచి ఆరోగ్యంతో బాగుండాలని కోరుకుంటున్నట్లు జైట్లీ తెలిపారు. రాజ్యసభ ప్రతిపక్ష నేత గులామ్ నబీ ఆజాద్ కూడా అన్సారీకి బెస్ట్ విషెస్ చెప్పారు. హన్సారీ మూడు దేశాల్లో గౌరవ పట్టాలు పొందారని, ఆయన రాసిన పుస్తకాలను కూడా మెచ్చుకున్నారు. సభను చాలా సజావుగా నడిపించారని, అల్లా మీకు సుదీర్ఘ జీవితాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నట్లు ఆజాద్ అన్నారు.