మూడో తరగతి చదువుతున్న విద్యార్థిపై లైంగిక దాడికి పాల్పడిన ఆయాకు 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ ఫాస్ట్ట్రాక్ స్పెషల్ కోర్టు సంచలన తీర్పు చెప్పింది. అంతేకాకుండా రూ.10వేల జరిమానా చెల్లించాలంటూ న్యాయమూర్తి గురువారం తీర్పు వెలువరించారు. చాంద్రాయణగుట్ట ఇన్స్పెక్టర్ కె.ఎన్.ప్రసాద్వర్మ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
బార్కస్ లోని లయోలా మోడల్ స్కూలులో బాలాపూర్ పరిధిలోని కొత్తపేట ప్రాంతానికి చెందిన కె.జ్యోతి(27) 2017లో ఆయాగా చేరింది. ఆ స్కూల్ లో మూడో తరగతి చదువుతున్న బాలుడు(8) బాత్రూంలోకి వెళ్లిన సమయంలో ఆయా అతడి వెనకాలే వెళ్లి అఘాయిత్యానికి పాల్పడింది. పలుమార్లు ఇలా లైంగిక దాడికి దిగింది. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దంటూ సిగరెట్, లైటర్ తో బాధిత బాలుడి చేతివేళ్లు, కాలివేళ్లపై కాల్చి భయపెట్టింది. కాలిన గాయాలను తల్లి గమనించి ఆరా తీయగా బాలుడు అసలు విషయం చెప్పాడు. దీంతో బాలుడి తండ్రి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. నిందితురాలిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. నేరం రుజువు కావడంతో ఆయాకు శిక్ష పడిందని సీఐ తెలిపారు.