శ్రీశైలం ప్రాజెక్టుకు వరదనీరు కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ప్లో 1, 47, 032 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 59, 632 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా. ప్రస్తుత నీటిమట్టం 883 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా. ప్రస్తుత నీటినిల్వ 204 టీఎంసీలుగా ఉంది. మరోవైపు శ్రీశైలం కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.