లక్నో : కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, అమేథి ఎంపీ రాహుల్ గాంధీ కనిపించడం లేదంటూ అమేథిలో పోస్టర్లు వెలిశాయి. గౌరవనీయులైన అమేథి పార్లమెంటేరియన్ అమేథి నుంచి అదృశ్యమయ్యారని పోస్టర్లలో రాసి ఉంది. సామాన్య వ్యక్తి కూడా రాహుల్ ప్రవర్తనపై విసుగు చెందుతున్నట్లు పోస్టర్లలో రాసి ఉంచారు. రాహుల్ ఎవరికైనా కనిపించిన యెడల చెబితే.. వారికి రివార్డు కూడా ఇస్తామని పోస్టర్లు వెలిశాయి. రాహుల్ కనిపించడం లేదు.. అని వెలిసిన పోస్టర్లపై స్థానిక కాంగ్రెస్ నేత యోగేంద్ర మిశ్రా స్పందించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ పనిగట్టుకుని రాహుల్పై
దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ పోస్టర్లపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు మిశ్రా. పోస్టర్లకు తమకు ఎలాంటి సంబంధం లేదని బీజేపీ నేత ఉమా శంకర్ పాండే స్పష్టం చేశారు. మిశ్రా వ్యాఖ్యలను పాండే ఖండించారు.