దుబాయ్: ఐసీసీ టెస్టు బౌలర్ల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతోన్న జడేజా మరో అరుదైన ఘనతను అందుకున్నాడు. బంగ్లాదేశ్ ఆటగాడు అల్హసన్ను వెనక్కినెట్టి ఆల్రౌండర్గా అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. భారత్-శ్రీలంక మధ్య కొలంబోలో జరిగిన రెండో టెస్టులో జడేజా బ్యాట్, బంతితోనూ రాణించిన సంగతి తెలిసిందే.
ఈ టెస్టులో జడేజా 70 పరుగులు సాధించడంతో పాటు 7 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో అతడు ఆల్రౌండర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. భారత్కు చెందిన పలువురు ఆటగాళ్లు తమ ర్యాంకులను మెరుగుపరుచుకున్నారు. బ్యాట్స్మెన్లలో పుజారా ఒక మెట్టు పైకెక్కి 3వ స్థానాన్ని దక్కించుకున్నాడు. 132 పరుగులు సాధించిన రహానె 11 స్థానాలు ఎగబాకి ఆరోస్థానంలో నిలిచాడు. కోహ్లీ ర్యాంకులో ఎలాంటి మార్పు లేదు. ఐదో ర్యాంకులోనే కొనసాగుతున్నాడు. కేఎల్ రాహుల్(11), సాహా(44), రవీంద్ర జడేజా(51) కూడా తమ స్థానాలను మెరుగుపరుచుకున్నారు.
బౌలర్ల జాబితాలో జడేజా అగ్రస్థానంలో కొనసాగుతుండగా మరో భారత ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ రెండో ర్యాంకును చేజార్చుకున్నాడు. ఇంగ్లాండ్కి చెందిన అండర్సన్ రెండో స్థానంలో నిలువగా అశ్విన్ మూడో ర్యాంకుతో సరిపెట్టుకున్నాడు. మహమ్మద్ షమి(20), ఉమేశ్ యాదవ్(22) తమ స్థానాలను మెరుగుపరుచుకున్నారు. ఆల్రౌండర్ల జాబితాలో జడేజా అగ్రస్థానంలో కొనసాగుతుండగా అల్హసన్, రవిచంద్రన్ అశ్విన్, మొయిన్ అలీ, బెన్ స్టోక్స్ ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.