ఒక సామాన్య రైతు కుటుంబం లో పుట్టి భారత ఉపరాష్ర్టపతి పదవి పొందడము అద్రష్టమని భారత ఉపరాష్ర్టపతి గా ఎన్నికైన ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. ఉపరాష్ర్టపతి గా ఎన్నికైన వెంకయ్యనాయుడు కు నెల్లూరు నగరంలోని వి.ఆర్. కళాశాల ప్రాంగణం లో ఆత్మీయసభ కార్యక్రమం నిర్వహించారు. ఈ సంధర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ నెల్లూరు నగరంలో వేలాది మంది చిన్నారులు వీధుల్లో జాతీయ పతాకాన్ని పట్టుకొని స్వాగతించడం మనసుకు ఆనందాన్ని కలిగించిందన్నారు. నెల్లూరు వి. ఆర్. కళాశాలలో చదివేటప్పుడే విద్యార్థి నాయకుడిగా బీజం పడిందన్నారు. ఈ సందర్భం గా తన చిన్ననాటి మధుర స్మ్రతులను గుర్తుకు తెచ్చుకున్నారు.