ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పంటలకు నీటి సమస్య తలెత్తేనా..?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 07, 2021, 04:46 PM

ప్రకాశం జిల్లాలో పంటలకు నీటి సమస్య తలెత్తేనా అంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు విస్తారంగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. కానీ ప్రకాశం జిల్లాలో మాత్రం వర్షాలు అంతంత మాత్రం కావడంతో ఈసారి పంటలకు నీటి సమస్య తలెత్తే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువు ఉన్న ప్రాంతంలో అయితే పెద్దగా నీటికి ఇబ్బంది లేకపోయినా.. మిగతా ప్రాంతాలలో నీటి సమస్య తలెత్తే అవకాశం ఉందని రైతులు అభిప్రాయపడుతున్నారు.


ఒక పక్క రాష్ట్రంలో వర్షాలు పడతాయని తుఫాను హెచ్చరిక కేంద్రం ఎప్పటికప్పుడు ప్రకటనలు చేస్తూనే ఉంది. ప్రకాశం జిల్లాలో మాత్రం వర్షాలు అంతంత మాత్రమే ఈ సారి కురిశాయి. చెరువులు కూడా కొన్ని ప్రాంతాలలో పూర్తిస్థాయిలో నిండలేదు. దీంతో వరి పంట వేసిన రైతులకు కొంచెం ఇబ్బందిగా మారే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. అలానే అరటి, కొన్ని ప్రాంతాలలో చెరుకు వేసిన రైతులు కూడా ఆలోచనలో పడ్డారు.


త్రాగునీటికి పెద్దగా ఈసారి ఇబ్బంది లేకపోయినా సాగునీటికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని, ఈ సారైనా వరుణ దేవుడు కరుణిస్తాడని, పడుతున్న తుఫానుల వల్ల ప్రకాశం జిల్లాలో వర్షాలు బాగా పడతాయేమోనని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com