దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన కస్టమర్లను అలర్ట్ చేస్తోంది. ఆధార్తో పాన్ కార్డు నంబర్లను లింక్ చేసుకోవాలని చెబుతోంది. సెప్టెంబర్ 30లోపు ఆధార్తో పాన్ లింక్ చేయాలని, లేదంటే కస్టమర్ల బ్యాంక్ ఖాతాలను నిలిపివేస్తామని హెచ్చరించింది. సెప్టెంబర్ 30 తర్వాత బ్యాంకింగ్ సేవలు యాక్సెస్ చేయాలంటే పాన్ ఆధార్ లింక్ తప్పనిసరిగా పేర్కొంది. ఈ ప్రక్రియ పూర్తి చేయని వారి ఖాతాలను ఆటోమేటిక్గా ‘ఇన్ఆపరేటివ్’ చేస్తామని హెచ్చరించింది.