ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ నెల 27న భారత్ బంద్

national |  Suryaa Desk  | Published : Mon, Sep 06, 2021, 12:33 PM

ఈ నెల 27న భారత్‌ బంద్‌కు పిలుపునిస్తున్నామని కర్షక నేత రాకేశ్‌ టికాయిత్‌ తెలిపారు. ప్రభుత్వం దేశాన్ని అమ్మేస్తోందని, దాన్ని అడ్డుకోవడమే తమ లక్ష్యమని టికాయిత్‌ చెప్పారు. ఎయిర్ పోర్టులు, రైల్వేలు, బ్యాంకులు ఇలా అన్నింటినీ ప్రధాని మోదీ అమ్మేస్తున్నారని, వీటికి అంబానీ, అదానీలే కొనుగోలుదారులని అన్నారు. ఈ అమ్మకాలను అడ్డుకుని దేశాన్ని రక్షిస్తాం అని చెప్పారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్‌ మోర్చా ఆదివారం చేపట్టిన ‘కిసాన్‌ మహాపంచాయత్‌’ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.


ఈ సందర్భంగా టికాయత్ మాట్లాడుతూ.. యూపీ ప్రభుత్వం చెరకు పంట ధరను ఒక్క రూపాయి కూడా పెంచలేదు. వచ్చే యూపీ ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని ఓటుతో ఓడగొట్టాలని ధ్వజమెత్తారు. మోదీ, అమిత్‌ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ లను బయటి వ్యక్తులుగా, విధ్వంసకారులుగా టికాయిత్‌ పేర్కొన్నారు. ప్రభుత్వం చర్చలకు ఆహ్వానిస్తే వెళ్తామన్నారు. తమ డిమాండ్లు నెరవేరేవరకూ ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ నెల 27న భారత్‌ బంద్‌కు పిలుపునిస్తున్నామని టికాయిత్‌ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com