బోగస్ చలాన్ల కుంభకోణం నేపథ్యంలో ఏపీ సర్కార్ అప్రమత్తమైంది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ తరహాలోనే మరికొన్ని శాఖల్లో తనిఖీలు నిర్వహించాలని నిర్ణయించింది. ప్రజలు చెల్లించే చలానాలు సీఎఫ్ఎంఎస్ కు చేరుతుందా అనే అంశంపై సోదాలు చేయనుంది. ఎక్సైజ్, మైనింగ్, రవాణా, కార్మిక తదితర శాఖల్లో అంతర్గత తనిఖీలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. చలానాలు సీఎఫ్ఎంఎస్ కు చేరేందుకు జాప్యం జరుగుతుందని ప్రభుత్వం గుర్తించింది. ఇప్పటివరకు 38 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రూ.8.13 కోట్ల నిధులు గోల్ మాల్ అయ్యాయి. ఇప్పటివరకు రూ.4.62 కోట్లు రికవరీ కాగా, 14 మంది సబ్ రిజిస్ట్రార్లపై చర్యలు తీసుకున్నారు.