కర్నూలు: ఆలూరు నియోజకవర్గం పరిధిలోని ఆస్పరి మండలం తంగరడోన గ్రామానికి చెందిన ఆంజనమ్మ (50) అనే మహిళ పాముకాటుతో మృతి చెందింది. ఆంజనమ్మ పొలం పనులకు వెళ్లి పనులు చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు. గమనించిన కుటుంబ సభ్యులు భర్త రంగస్వామి ఆమె హుటాహుటిన చికిత్స నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అంజనమ్మ మృతి చెందింది.