ఏపీ రాజధాని అంశంపై మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం ఎక్కడుంటే అక్కడే రాజధాని అని అన్నారు. ‘‘పులివెందుల, విజయవాడ కావొచ్చు. రేపు మరో ప్రాంతం కావొచ్చు. సీఎం నివాసం ఎక్కుడుంటే అదే రాజధాని. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం 3 రాజధానుల నిర్ణయం జరిగింది. రాజ్యాంగంలో రాజధాని అనే పదమే లేదు’’ అని మంత్రి గౌతమ్ రెడ్డి వ్యాఖ్యానించారు.