గుంటూరు: పెట్రోల్ డీజిల్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ సత్తెనపల్లిలో టీడీపీ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వైవి ఆంజనేయులు పాల్గోన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ పాలన పన్నుల భారంతో ప్రజలు ఆధారం కోల్పోతున్నారన్నారు. సంక్షేమ పధకాల పేరుతో జరుగుతున్న దోపిడిని అరికట్టాలి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో
మన్నెం మల్లి, మహిళా నాయకురాలు వందనా దేవి, చౌటా శ్రీనివాసరావు, ఆళ్ల సాంబయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ యే లి నీ డి రామస్వామి మరియు తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.