ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ మొక్క ఇంటి చుట్టు ఉంటే రోగాలు మన వెంటే!

national |  Suryaa Desk  | Published : Thu, Aug 26, 2021, 03:44 PM

పంట పొలాలు, ఇళ్ల మధ్య ఖాళీ స్థలాల్లో పెరిగే పార్థీనియం (వయ్యారిభామ) కలుపు మొక్కతో అప్రమత్తంగా ఉండాలని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ మొక్కల వల్ల ప్రజలకు ఆరోగ్య సమస్యలతో పాటు, పంట దిగుబడులు తగ్గుతున్నాయని రాజేంద్రనగర్ లోని జాతీయ మొక్కల ఆరోగ్య నిర్వహణ సంస్థ డైరెక్టర్ జనరల్ చెప్పారు. జన నివాస ప్రాంతాల్లో ఈ మొక్కలు పెరిగితే దోమలు, బొద్దింకలు, ఎలుకలు అధికమై ప్రజలకు జ్వరం, అలర్జీ వంటి వ్యాధులు వస్తాని వివరించారు. కాగా పంటలకు హాని చేసే ఈ కలుపు మొక్క, 1950లో అమెరికా నుండి దిగుమతి చేసుకున్న గోధుమలతో పాటుగా ఈ విత్తనం మన దేశంలోకి ప్రవేశించినట్లుగా చెప్పబడుతోంది. అతి తక్కువ కాలంలో దేశమంతటా విస్తరించి అన్ని రకాల నేలలపైన మొలకెత్తడం ప్రారంభించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com