పంట పొలాలు, ఇళ్ల మధ్య ఖాళీ స్థలాల్లో పెరిగే పార్థీనియం (వయ్యారిభామ) కలుపు మొక్కతో అప్రమత్తంగా ఉండాలని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ మొక్కల వల్ల ప్రజలకు ఆరోగ్య సమస్యలతో పాటు, పంట దిగుబడులు తగ్గుతున్నాయని రాజేంద్రనగర్ లోని జాతీయ మొక్కల ఆరోగ్య నిర్వహణ సంస్థ డైరెక్టర్ జనరల్ చెప్పారు. జన నివాస ప్రాంతాల్లో ఈ మొక్కలు పెరిగితే దోమలు, బొద్దింకలు, ఎలుకలు అధికమై ప్రజలకు జ్వరం, అలర్జీ వంటి వ్యాధులు వస్తాని వివరించారు. కాగా పంటలకు హాని చేసే ఈ కలుపు మొక్క, 1950లో అమెరికా నుండి దిగుమతి చేసుకున్న గోధుమలతో పాటుగా ఈ విత్తనం మన దేశంలోకి ప్రవేశించినట్లుగా చెప్పబడుతోంది. అతి తక్కువ కాలంలో దేశమంతటా విస్తరించి అన్ని రకాల నేలలపైన మొలకెత్తడం ప్రారంభించింది.