ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రగ్రహణం సందర్భంగా రేపు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 06, 2017, 10:27 AM

తిరుమల: చంద్రగ్రహణం సందర్భంగా రేపు శ్రీవారి ఆలయం మూసివేయనున్నట్లు జేఈవో శ్రీనివాసరాజు తెలిపారు. రేపు సాయంత్రం 4 గంటల నుంచి అన్నప్రసాద వితరణ నిలిపివేయనున్నట్లు ప్రకటించారు. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి ఉచిత దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం, కాలినడకన కొండ ఎక్కి వచ్చిన భక్తులకు మూడు గంటల సమయం పడుతోంది. ఎల్లుండి ఉదయం 2 గంటల వరకు శ్రీవారి ఆలయం మూసి ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com