న్యూఢిల్లీ : పార్లమెంట్ హాల్లో ఉప రాష్ట్రపతి ఎన్నికకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. రాజ్యసభ సభ్యులు సచిన్ టెండూల్కర్, రేఖ, లోక్సభ ఎంపీలు హేమమాలిని, డింపుల్ యాదవ్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటేసిన అనంతరం సచిన్ మాట్లాడుతూ.. ఎన్నికలు ఎక్కడ జరిగినా.. ప్రతీ సిటిజన్ తప్పకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పారు. హేమమాలిని మాట్లాడుతూ.. వెంకయ్యనాయుడిని ప్రతి ఒక్కరూ అభిమానిస్తారని తెలిపారు. పార్లమెంట్ సభ్యులందరికీ వెంకయ్య తెలుసు. వెంకయ్య రాజకీయ సమర్థుడు అని పేర్కొన్నారు. ఇక రేఖ, ఎంపీ డింపుల్ యాదవ్ కాసేపు ముచ్చటించుకున్నారు. వీరిద్దరూ ఫోటోలకు ఫోజులిచ్చారు.