దేశంలోనే మొదటిసారిగా హెలికాప్టర్ టాక్సీ సర్వీసులను బెంగళూరులో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది నవంబర్లో బెంగళూర్ సిటీ నుంచి కెంపెగౌడ విమానశ్రయం వరకు ఈ హెలికాప్టర్ టాక్సీ సేవలు ప్రారంభించనున్నారు. ఈ మేరకు తుంబి ఏవియేషన్, బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్లు ఒప్పందం చేసుకున్నాయి. ఈ హెలీ టాక్సీ సేవల ద్వారా రోడ్డు మార్గంలో రెండు గంటలు పట్టే ప్రయాణాన్ని కేవలం 15 నిమిషాల్లో పూర్తి చేసే అవకాశం కలుగుతుంది. ఈ టాక్సీకి సంబంధించిన రేట్లను ఇంకా నిర్ణయించలేదు. కాకపోతే అందరికీ అందుబాటులో ఉండేలా ధరలు నిర్ణయించాలని కేంద్ర పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా కోరినట్లు సమాచారం. బెంగళూరు తర్వాత ఇతర ప్రాంతాల్లో కూడా హెలీ టాక్సీ సేవలను అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తామని మంత్రి తెలిపారు.