ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు వారి ఖాతాల్లోకి డబ్బులు

national |  Suryaa Desk  | Published : Mon, Aug 09, 2021, 11:48 AM

పీఎం కిసాన్ స‌మ్మాన్ నిధులు సోమ‌వారం విడుద‌ల కానున్నాయి. ఈరోజు మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల నుంచి రైతుల ఖాతాల్లో న‌గ‌దు జ‌మ కానుంది. వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ప్ర‌ధాని మోదీ ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించ‌నున్నారు. దేశ‌వ్యాప్తంగా 9.75 కోట్ల రైతుల ఖాతాల‌కు రూ.19,500 కోట్లు బ‌దిలీ కానున్నాయి. ఈ కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా ప్ర‌ధాని జాతినుద్దేశించి ప్ర‌సంగించ‌నున్నారు. పీఎం కిసాన్ స‌మ్మాన్ నిధి ప‌థ‌కం కింద అర్హులైన రైతుల‌కు ప్ర‌తీ 4 నెల‌ల‌కు ఒక‌సారి రూ.2 వేల చొప్పున 3 విడతల్లో నగదు బ‌దిలీ అవుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com