ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నూతన ఆవిష్కరణలకు ముందడుగు వేయాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 21, 2017, 12:26 PM

చాపాడు : సాంకేతిక విద్యనభ్యసిస్తున్న మీలో విజ్ఞానం, చైతన్యం, వివేకం కలిసి ఉంటే దేన్నయినా సాధిస్తారని భారతీయం సత్యవాణి అన్నారు. సోమవారం చాపాడులోని సీబీఐటీ, వీబీఐటీ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో నేటి యువతకు దశ, దిశ నిర్దేశంపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యవాణి మాట్లాడుతూ ఇటీవల శ్రీహరికోటలో 104 ఉపగ్రహాలను ఒకేసారి అంతరిక్షంలోకి పంపారని, దీన్ని స్ఫూర్తిగా తీసుకుని యువత నూతన ఆవిష్కరణలకు ముందడుగు వేయాలని సూచించారు. రత్నగర్భ దేశంగా పేరున్న మనదేశాన్ని ఉపయోగించుకునేందుకు విజ్ఞత అవసరమన్నారు. క్రమశిక్షణ కల్గి మానసిక బలహీనతలకు దూరంగా ఉండాలని సూచించారు. లాల్‌బహదూర్‌శాస్త్రి, స్వామి వివేకానంద, అబ్దుల్‌కలాం లాంటి వారిని అదర్శంగా తీసుకుని ఉన్నత స్థానాలు అధిరోహించాలని ఉద్బోధించారు. కళాశాలల కరస్పాండెంటు జయచంద్రారెడ్డి మాట్లాడుతూ చదువుతోపాటు విలువలు తెలుసుకునేందుకు ఈ సమావేశం ఏర్పాటుచేసినట్లు వివరించారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు విద్యాసాగర్‌రెడ్డి, ఉపేంద్రబాబు, రెడ్డికుమార్‌, ప్రిన్సిపల్స్‌ పాండురంగన్‌రవి, శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com