శ్రీనగర్: జమ్మూకశ్మీర్లోని కుల్గాం జిల్లాలో భద్రతా బలగాలు.. ఉగ్రవాదుల మధ్య ఈరోజు ఉదయం ఎదురుకాల్పులు జరిగాయి. భద్రతా బలగాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు. మరోవైపు సోషియాన్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆర్మీ అధికారితో పాటు జవాను మృతిచెందారు. తాజా ఘటనల నేపథ్యంలో సైన్యం మరింత అప్రమత్తమైంది. ఆయా ప్రాంతాల్లో ఉగ్రవాదుల కోసం గాలింపు చేపట్టింది.