ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 02, 2017, 11:41 AM

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సంతోష్‌ మోహన్‌దేవ్‌(83) బుధవారం కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో ఆయన అసోం లోని సిల్‌చార్‌లో తుదిశ్వాస విడిచారు.మన్మోహన్‌సింగ్‌ ప్రభుత్వంలో భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా మోహన్‌దేవ్‌ పనిచేశారు. గతంలో పలు శాఖలకు సహాయ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఏడుసార్లు లోక్‌సభకు ఎన్నికైన మోహన్‌దేవ్‌కు భార్య, నలుగురు కుమార్తెలు ఉన్నారు. 1980లో మొదటిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. సిల్‌చార్‌ నుంచి ఐదు సార్లు, త్రిపుర నుంచి రెండుసార్లు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. ఆయన కుమార్తె సుష్మితాదేవ్‌ ప్రస్తుతం ఎంపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com