కర్నూలు జిల్లాలో హెచ్ఆర్సీ కార్యాలయం ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. న్యాయరాజధానిగా కర్నూలును ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. ఐతే ఇప్పుడు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అమరావతిలో ఉన్న హైకోర్టు కూడా కర్నూలు కేంద్రానికి తరలే అవకాశం ఉంది. ఇప్పటికే స్థల పరిశీలన జరిపారని సమాచారం.