చిలకలూరిపేట : గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణం సీఆర్ కాలనీలో ఏర్పాటు చేసిన మద్యం దుకాణం మూసివేయాలంటూ మహిళలు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. పండరీపురంలోని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఇంటి ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ముందుగా నినాదాలు చేస్తూ కాలనీ నుంచి మంత్రి ఇంటి వద్దకు చేరుకున్నారు. అయితే ఆ సమయంలో మంత్రి ఇంట్లో లేరు. సమాచారం అందుకున్న పోలీసులు, ఎక్సైజ్ అధికారులు అక్కడికి చేరుకుని చేరుకున్నారు. 15 రోజుల్లో చర్యలు తీసుకుంటామని మహిళలకు అర్బన్ సీఐ సురేశ్ బాబు, ఎక్సైజ్ సీఐ లత హామీ ఇచ్చారు. దీంతో మహిళలు నిరసన విరమించారు.