అమరావతి: బ్యాంకర్లతో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాల వారీగా భూయజమానులు, కౌలురైతుల సమాచారం ఇవ్వాలని అన్నారు. గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కౌలురైతులు అధికంగా ఉన్నారని చెప్పారు.బ్యాంకర్లు తమ నెట్వర్క్ ద్వారా వివరాలు సేకరించి కౌలురైతుల స్థితిగతులపై అధ్యయనం చేయాలన్నారు. బ్యాంకర్లు రుణాలిచ్చే విధానాన్ని సరళీకరించాలని తెలిపారు. రూ.లక్ష రుణాలపై ఎటువంటి ఆంక్షలు విధించవద్దని అన్నారు.