వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. కర్నూల్ జిల్లా, ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలోని పడకండ్ల గ్రామానికి చెందిన నాగరాజు అనే వ్యక్తి క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. బంధువులు చికిత్స నిమిత్తం ఆళ్లగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా మెరుగైన చికిత్స కోసం నంద్యాలకు 108లో తరలించారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.