శ్రీనగర్ : మోస్ట్ వాంటెడ్ లష్కరే తోయిబా ఉగ్రవాది అబు దుజానాను భారత భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. పుల్వామా జిల్లాలోని హక్రీపురాలో జరిగిన ఎన్కౌంటర్లో అబు హతమయ్యాడు. హక్రీపురాలోని ఓ ఇంటిలో ఉగ్రవాదులు తలదాచుకున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు బలగాలకు సమాచారం అందించాయి. ఈ క్రమంలో భద్రతా బలగాలు ఆ ఇంటిని చుట్టుముట్టాయి. దీంతో టెర్రరిస్టులు బలగాలపై కాల్పులు జరిపారు. అబుతో పాటు మరో ఇద్దరు ఉగ్రవాదులను బలగాలు చంపేశాయి. అయితే ఆ ఇంట్లో ఇంకా ఉగ్రవాదులు ఉన్నారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. బలగాలు ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి.