కర్నూలు జిల్లా పాములపాడు మండలం జూటూరు గ్రామ శివార్లలో, శనివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయాలయ్యారు. గ్రామ సమీపంలో కర్నూలు - గుంటూరు జాతీయ రహదారిపై, మలుపు వద్ద అదుపు తప్పి రెండు వాహనాలు ఢీ కొన్నట్లు స్థానికులు పేర్కొన్నారు. గాయపడిన వారిని ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.