అనంతపురం: డిగ్రీతో పాటు అదనపు నైపుణ్యాలు ఉంటేనే పోటీ ప్రపంచంలో రాణిస్తారని జేఎన్టీయూ ఉపకులపతి సర్కార్ పేర్కొన్నారు. జేఎన్టీయూ సీఎస్ఈ విభాగం ఆధ్వర్యంలో బిగ్డేటాపై సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉపకులపతి ప్రారంభించి మాట్లాడుతూ బిగ్ డేటా అన్నది తాజాగా హాట్ టాఫిక్గా మారిందన్నారు. ఇంజినీరింగ్లోని అన్ని బ్రాంచుల్లోని విద్యార్థులు ఇందులో అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వేగంతో పాటు అదనపు సామర్థ్యాలు పెంచుకోవడానికి ఉపయుక్తం అవుతుందన్నారు. వ్యాపార సంబంధ లావాదేవీల్లో ఎంతో ఉపయుక్తం అవుతుందన్నారు. రిజిస్ట్రార్ కృష్ణయ్య, ప్రిన్సిపల్ ప్రహ్లాదరావు, వైస్ ప్రిన్సిపల్ దేవకుమార్, విభాగం అధిపతి వసుంధర తదితరులు పాల్గొన్నారు.