తూర్పుగోదావరి : తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం గొల్లవెల్లిలో ఈ నెల 24 నుంచి జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలు జరుగుతాయని హోంమంత్రి చినరాజప్ప అన్నారు. నిమ్మకాయల వెంకటరంగయ్య మెమోరియల్ వాలీబాల్ పోటీలు ఈ నెల 28 వరకు జరుగుతాయన్నారు. ఈ పోటీల్లో మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లి, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన 21 జట్లు పాల్గొంటాయని తెలిపారు. పోటీల్లో భాగంగా ఈ నెల 28న నారా లోకేశ్ హాజరవుతారని ఆయన వివరించారు.