ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదుల కాల్చివేత

Andhra Pradesh Telugu |  IANS  | Published : Mon, Jul 31, 2017, 09:06 AM

శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో భద్రతా దళాలు ఆదివారం ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. తహాబ్‌ గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం మేరకు పుల్వామాకు చెందిన స్పెషల్‌ ఆపరేషన్స్‌ గ్రూప్‌(ఎ్‌సవోజీ), 44 రాష్ట్రీయ రైఫిల్స్‌ సిబ్బంది శనివారం రాత్రి కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. గాలింపు కొనసాగుతుండగానే.. ఆదివారం ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులు జరపగా.. ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. కాగా వారు ఎవరో, ఏ ఉగ్రవాద సంస్థకు చెందినవారో తెలియరాలేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com