ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉదయాన్నే గోరు వెచ్చటి నిమ్మ రసం త్రాగడం వలన కలిగే ప్రయోజనాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 29, 2017, 11:21 AM

చాలామంది ఉదయాన్నె ఒక హాట్ కప్ కాఫీ లేదా గరం గరం చాయ్ తో మొదలుపెడతారు. కాఫీ, లేదా టీ నిద్ర మత్తును వదిలించి ఆక్టివ్ గ చేయడం లో సఫాలికృతం అవుతాయి, సందేహం లేదు, కాని ఆరోగ్య పరంగా ఇంతకంటే మంచి డ్రింక్స్ ఉన్నాయి. ఒక గ్లాస్ గోరు వెచ్చటి నీటిలో కొంచం నిమ్మరసం కలుపుకొని తాగితే చాల ప్రయోజనాలున్నాయి. అవేమిటో చూద్దాం.నిమ్మ లో ఉండే అల్కలైన్ లక్షణాలు దీన్ని మంచి శరీరం లోని టాక్సిక్ లను నిర్మూలించే సాధనంగా చేస్తాయి. నిమ్మ అసిడిక్ గ అనిపించినప్పటికీ దీంట్లోని మంచి గుణాలు శరీరం లో pH విలువలను సమతుల్యం చేయడం లో  చాల ఉపయోగపడుతుంది.





వేడి నిమ్మ రసం కాలి కడుపున త్రాగడం వలన గాస్ట్రో  సిస్టం మెరుగు పడుతుంది. దీనివలన శరీరం న్యూట్రిషన్లు మరియు ఇతర మినరల్స్ గ్రహించే శక్తి పెరుగుతుంది. తద్వారా, ఓవర్ అల్ హెల్త్ మెరుగు పడడం తో పాటుగ, వ్యాదులకు దూరంగా ఉండవచ్చు కూడా. నిమ్మకాయ లో ఉండే పెక్టిన్ అణే ఓక ప్రత్యెక ఫైబర్ పదార్థం వలన ఇది బరువు తగ్గలనుకునే వారికి ఒక దివ్య ఔషదం లాంటిదే. దీంతో మెటబాలిజం కూడా మెరుగు పడి ఆకలి నియంత్రణ కు దారి తీస్తుంది. పొద్దున్నే ఒక గ్లాస్ నిమ్మ రసం తాగడం వలన కడుపు కాలి అయి ప్రశాంతత ను సమకూరుస్తుంది.  ముందు రోజు మసాలాలు, జంక్ టిని ఉంటె అవ్వన్నీ క్లీన్ అయి కడుపు ఉబ్బటం, అలజడి, అల్సర్లు లాంటివి రాకుండా చేయడం లో కూడా నిమ్మ దానికి అదే సాటి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com