బెంగళూరు: దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. ఇందులో భాగంగా, ఫ్లిప్కార్ట్.. మైక్రోసాఫ్ట్ అజుర్ను ఎక్స్క్లూజివ్ పబ్లిక్ క్లౌడ్ ప్లాట్ఫాంగా ఉపయోగించుకోనుందని సత్య నాదెళ్ల తెలిపారు. కస్టమర్లకు అత్యుత్తమ ఆన్లైన్ షాపింగ్ సేవలందించే ఉద్దేశంతోనే ఈ భాగస్వామ్యం ఏర్పాటు చేసుకోవడం జరిగిందని ఆయన అన్నారు.