అమరావతి: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధును డిప్యూటీ కలెక్టర్గా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రోజు ఉత్తర్వులు జారీచేసింది. సచివాలయానికి తన తల్లిదండ్రులతో కలిసి వచ్చిన సింధు సీఎం చంద్రబాబు, ఆర్థికశాఖ ఉన్నతాధికారులను కలిశారు. సీఎం చంద్రబాబు ఆమెకు స్వయంగా ప్రభుత్వ ఉత్తర్వు కాపీని అందజేశారు. అనంతరం సింధు మాట్లాడుతూ.. డిప్యూటీ కలెక్టర్గా సీఎం నుంచి నియామక పత్రం అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. తన తొలి ప్రాధాన్యత బ్యాడ్మింటన్కేనని స్పష్టంచేశారు. క్రీడలపైనే తాను దృష్టిసారించనున్నట్టు స్పష్టంచేశారు. క్రీడల్లో రాణించి మరిన్ని విజయాలు తెచ్చిపెట్టాలని సీఎం సూచించారని తెలిపారు. మహిళలు క్రీడల్లో రాణించడం పట్ల చంద్రబాబు సంతోషంగా ఉన్నారన్నారు. క్రీడాకారులకు సీఎం చక్కటి ప్రోత్సాహం ఇస్తున్నారని అన్నారు. 30 రోజుల్లోగా విధుల్లో చేరాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
రియో ఒలింపిక్స్లో రజత పతకం సాధించి తెలుగు కీర్తిని ప్రపంచానికి చాటిచెప్పిన సింధూకు గతంలో గ్రూప్-1 ఉద్యోగం ప్రకటించి విషయం తెలిసిందే. అంతేకాకుండా ఆమెకు రూ.3కోట్లు నగదుతో పాటు అమరావతిలో వెయ్యి గజాల స్థలాన్ని కూడా ప్రభుత్వం కేటాయించింది.