నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టయ్యారు. ఏపీ సీఐడీ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెక్షన్ 24 కింద రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేసింది. సెక్షన్ 50 కింద అరెస్ట్ చేస్తున్నట్లుగా కుటుంబసభ్యులకు నోటీసులు అందజేసింది. 124(A), 153(B), 505 IPC, 120(B) సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. అనంతరం ఆయన్ని మంగళగిరి సీఐడీ కార్యాలయానికి తరలించింది.