ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో భక్తులు తలనీలాలు సమర్పించే కళ్యాణకట్టను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కల్యాణ కట్ట సిబ్బంది విజ్ఞప్తి మేరకు అధికారులు కేశ ఖండనశాలను నిలిపివేశారు. ఇప్పటికే కల్యాణకట్టలో పనిచేసే సిబ్బందిలో ఇద్దరు కరోనాతో మృతి చెందారు. కరోనా ప్రభావంతో ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య భారీగా తగ్గింది. ఉదయం 6 నుంచి 11 గంటలకు వరకే మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవార్ల దర్శనానికి అధికారులు అనుమతి ఇస్తున్నారు. అలాగే క్షేత్రానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి చేశారు.