ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీహార్ ప్రజలను నితీష్ మోసం చేశారు : లాలూ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 27, 2017, 12:34 PM

పాట్నా : బీహార్ ప్రజలను జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ మోసం చేశారని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జేడీయూ - బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అనంతరం లాలూ మీడియాతో మాట్లాడారు. నితీష్ కుమార్ నమ్మక ద్రోహి నిర్ణయాన్ని బీహార్ ప్రజలు తప్పుబడుతున్నారని తెలిపారు. బీహార్‌లో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైందని ఆవేదన చెందారు. ఏది ఏమైనప్పటికీ బీహార్ అత్యంత అప్రమత్తత కలిగిన రాష్ట్రమని లాలూ స్పష్టం చేశారు. పరిస్థితులను ప్రజలంతా గమనిస్తున్నారని తెలిపారు. దేశాన్ని ఐక్యం చేసేందుకు మన మధ్యన గాంధీ లేరని ఆవేదన వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com